చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రం "చిరుత" ద్వారా తెలుగులో పరిచయమైన నటి నేహా శర్మ. ఆ చిత్రం తర్వాత ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ ఆమె కెరీర్కు హెల్ప్ కాలేదు. ఆ తర్వాత కుర్రాడులో నటించింది. అదీ ఫ్లాప్ కావడంతో ఇక లాభం లేదని రూటుమార్చి హిందీలోకి వెళ్లింది.