మేమిద్దరం రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాం.. త్వరలో పిల్లలుకంటా : అలియా భట్

శుక్రవారం, 28 అక్టోబరు 2016 (09:20 IST)
బాలీవుడ్ యువనటి అలియా భట్ ఎట్టకేలకు ఒప్పుకుంది. కరణ్ జోహర్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో బాలీవుడ్‌కి అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయి. తామిద్దరం స్నేహితులం అని అలియా భట్ పలు సందర్భాల్లో చెప్పింది. 
 
ఆ తర్వాత వీరు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై అలియాను ఎప్పుడు అడిగినా సిద్దూ నా బెస్ట్ ఫ్రెండ్, అంతకు మించి ఏమీ లేదని చెప్పేది. తాజగా ఇదే విషయంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆమెకు ఘాటుగా సమాధానమిచ్చింది. ''ఎస్.. మేమిద్దరం రెండు సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్నాం. అతను నా జీవితంలో సగభాగం. మేము విడిపోలేదు, అతనితో నేను ఇద్దరు పిల్లల్ని కంటాను. నీకేమన్నా అభ్యంతరమా?'' అని మొహం మీద కొట్టినట్లు చెప్పింది అలియా. దీంతో నివ్వెరపోవడం ఆ రిపోర్టర్ వంతైయింది. 

వెబ్దునియా పై చదవండి