అమీ జాక్సన్... శంకర్ సినిమాల హీరోయిన్గా మంచి పేరు కొట్టేసింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్తో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో 2.0 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోతోందని.. ప్రస్తుతానికి సూపర్ స్టార్తో నటిస్తున్నందున.. ఆమెను ఎన్నికల ప్రచారంలోకి దించాలని పన్నీర్ సెల్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
సినిమా తారలు రాజకీయాల్లో రావడం మామూలే. ఈ కోవలోనే ఎన్టీఆర్, చిరంజీవి, జయలలిత ఎంజీఆర్ వంటి ఎంతో తారలు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తాజాగా హాట్ గ్లామర్ తార అమీ జాక్సన్.. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నాడీఎంకే నుంచి వర్గంగా చీలిపోయిన ఓపీఎస్ అండ్ టీమ్ ఈమెను రంగంలోకి దించేందుకు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.