అనసూయను చూస్తే వారందరికీ అసూయ పుడుతోందట.. ఎందుకని?

గురువారం, 18 ఆగస్టు 2016 (15:48 IST)
అనసూయను చూస్తే.. చాలామందికి అసూయ అట.. ఈ విషయాన్ని ఆమె వెల్లడిస్తూ.. నవ్వేస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే... ఆమె తరచూ.. ఫొటో సెషన్‌ పేరుతో కొన్ని ఫొటోలు దిగుతూ.. పబ్లిసిటీ చేసేస్తుంది. అవి ఎందుకు దిగుతుందో.. తెలీదుకానీ.. అవన్నీ చూసి.. చాలామంది అసూయ పడుతున్నట్లు చెబుతోంది. 
 
ఇటీవలే బుల్లితెరపై.. యాంకరింగ్‌లో ఆమె దిట్టగా టీవీరంగం ఫిక్స్‌ చేసేసింది. రేపోమాపో.. మాటీవీ.. ఈటీవీలో వారు అవార్డు కూడా ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారు. ప్రజాకర్షణగల యాంకర్‌గా ఆమెకు పేరు ఉందట.. సో.. క్యాజువల్‌గా అసూయ రావడం మామూలే.. కాగా, ఇటీవలే మళ్ళీ కొత్త ఫొటో షూట్‌ చేసింది. ఆ స్టిల్‌లో ఇలా సందడి చేసింది.

వెబ్దునియా పై చదవండి