ఎట్టకేలకు కేరళ కుట్టికి ఛాన్స్ దక్కించుకుంది

మంగళవారం, 20 అక్టోబరు 2020 (14:03 IST)
ప్రేమమ్, శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు.. తదితర చిత్రాల్లో నటించిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్ముడు టాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో బాగా అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ... ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్లో వెనకబడింది.
 
ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఇక ఈ అమ్మడుని అంతా మరచిపోయారు. ఇలాంటి టైమ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమాలో నటించింది.
 
 ఈ సినిమా సక్సస్ సాధించడంతో మళ్లీ కెరీర్ పైన ఆశలు మొదలయ్యాయి ఈ కేరళ కుట్టికి. తాజాగా మరో సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 
ఇంతకీ.. ఏ సినిమాలో అంటే.. నిఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పైన రాబోతున్న 18-పేజెస్ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోంది అనుపమ. నిజానికి ఈ సినిమాలో ముందుగా అనుపమ పేరే తెర పైకి వచ్చింది. కానీ అంతలోనే ఆమె కాదని, ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది.
 
ఈ క్రమంలో అను ఎమ్మాన్యుయేల్, షాలినీ పాండేతో పాటు ఉప్పెన ఫేం కృతి షెట్టి పేరు కూడా వినిపించింది. అలా చుట్టూ తిరిగి ఆఖరికి అనుపమ పరమేశ్వరన్‌నే వరించింది 18-పేజెస్ ఆఫర్. ఈ సినిమా సక్సస్ అయితే.. మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి.. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో... అమ్మడు కెరీర్‌ని ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు