'నేనే రాజు నేనే మంత్రి'లో న్యూస్ ఛానల్‌ బాస్‌గా కేథరిన్.. ఖైదీకి తర్వాత..?

శనివారం, 28 జనవరి 2017 (16:54 IST)
మెగాస్టార్ 150వ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో చిందులేసే ఛాన్సును నోటి దురుసుతో చేజార్చుకున్నప్పటికీ.. కేథరిన్‌ చేతిలో ఆఫర్లు మస్తుగానే ఉన్నాయి. 'సరైనోడు'తో యంగ్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్, ఓ న్యూస్‌ఛానెల్‌కి బాస్‌గా తాజా సినిమాలో కనిపిస్తుందని టాక్ వస్తోంది. 
 
ఈ సినిమా వివరాల్లేంటంటే.. రానా- కాజల్ అగర్వాల్ జంటగా రానున్న మూవీ 'నేనే రాజు నేనే మంత్రి'. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్‌కి నిర్మాత సురేష్‌బాబు. అంతా ఓకే అయితే ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో కేథరిన్ ఓ న్యూస్ ఛానల్‌కు బాస్‌గా అలరించనుంది. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. స్టోరీలో తన క్యారెక్టర్ వివరించగానే వెంటనే కేథరిన్ ఓకే చెప్పిందట.
 
ప్రస్తుతం మీడియాకు సంబంధించిన అంశాలపై షూట్ చేయడం కూడా జరిగిపోయిందని ఇన్‌సైడ్ సమాచారం. ఖైదీ నుంచి డ్రాపైన తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ లేవు. రానా సినిమాతో అయినా కేథరిన్‌కు అదృష్టం కలిసి రావాలని సినీ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి