ఫిజియోథెరపిస్టును లైన్లో పెట్టి సీక్రెట్ పెళ్లి చేసుకున్న ప్రభుదేవా? (video)

శుక్రవారం, 20 నవంబరు 2020 (14:44 IST)
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాకుండా నటుడుగా, దర్శకుడుగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే, ఈయన తొలి భార్య రమలతకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ నయనతారతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలాడు. వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా నయనతారకు ప్రభుదేవా దూరమయ్యాడు. 
 
ఈ క్రమంలో రీసెంట్‌గా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, తాజాగా ప్రభుదేవా, బీహార్‌కు చెందిన పిజియోథెరపిస్ట్‌ను సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారట. ప్రభుదేవా దంపతులు ఇప్పుడు చెన్నైలోనే ఉన్నారట. 
 
గతంలో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న ప్రభుదేవా ఫిజియో థెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియోథెరపిస్ట్‌తో ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా తరపు నుంచి ఎలాంటి సమాచారం లేదు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు