బాలీవుడ్ మాజీ ప్రేమికులు కత్రినాకైఫ్, రణ్బీర్ కపూర్ మళ్లీ కలుసుకోవాలని అభిమానులతో పాటు సినీనటులు కూడా కోరుకుంటున్నారు. కరీనా కూడా ఈ జంట తిరిగి కలుసుకోవాలని ఆశపడుతోందట. రణబీర్కి కరీనా అక్క అనే సంగతి తెలిసిందే. రణ్బీర్, కత్రినా విడిపోయినప్పుడు ఎలాగైనా వారికి నచ్చజెప్పి వారిని కలపాలని కరీనా భావించిందట. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది.
కాగా వీరిద్దరు కలిసి నటిస్తున్న ''జగ్గాజాసూస్'' చిత్రంతోనైనా కలుస్తారని అనుకున్నారట. కానీ షూటింగ్లో కూడా ఈ జంట ఎడమొహం పెడమొహంగానే ఉన్నారట. ఇకపోతే కరీనా ఇటీవల మీడియాతో మాట్లడుతూ...''రణబీర్, కత్రినా జంట చాలా బాగుంటుంది.. కత్రినా నా తమ్ముడికి తగిన జోడీ.. వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకుంటే చాలా బాగుంటుంది'' అని బహిరంగంగానే అన్నారు. ఈ జంటను కలపడానికి కరీనా తీవ్రంగా ప్రయత్నిస్తుందట. మరి అక్క మీద గౌరవంతో ఈ జంట కలుస్తుందో లేచి వేచి చూడాల్సిందే.