ప్రభాస్ పారితోషికం రూ. 100 కోట్లా? ఆస్తులు రూ. 7 వేల కోట్లా?

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (18:04 IST)
ప్రభాస్. ఇప్పుడు ఆలిండియా టాప్ స్టార్లలో ఒకరు. బాహుబలి చిత్రంతో తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు ప్రభాస్. బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలియలేదు కానీ సాహో చిత్రానికి రూ. 75 కోట్లు తీసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
 
ఇప్పుడు దీన్ని తలదన్నే వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటయా అంటే... ప్రభాస్ ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం పుచ్చుకున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే ప్రభాస్ ఆస్తుల్లోనూ బాహుబలి అంటూ ఇండస్ట్రీ సర్కిళ్లలో మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ తండ్రి గతంలో నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లోనే ఆయన పలు నగరాల్లో హోటళ్లు, ఫామ్ హౌసులు, ఎస్టేట్స్, భూములు వున్నాయట. వాటి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం సుమారుగా రూ. 7 వేల కోట్ల వరకూ వుంటాయని చెప్తున్నారు. మరి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజమో తెలియాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు