సావిత్రిగా సమంతను కాదని కీర్తి సురేష్‌ ఎంపిక...? బరువు పెరగాలని సమ్మూ వద్దనుకుందా?

బుధవారం, 4 జనవరి 2017 (14:57 IST)
అలనాటి మహానటి సావిత్రిగా సమంత నటించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వచ్చింది. దశాబ్దాల పాటు వెండితెరై వెలిగిన సావిత్రి జీవితకథతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తెలిసింది. అయితే పెళ్ళి పనులతో పాటు.. ఈ సినిమా సమంత బరువు పెరగాలని షరతులు పెట్టడంతో సమంత ఆ అవకాశాన్ని చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే..? ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ సమంతను పక్కన బెట్టి నేను శైలజ హీరోయిన్ కీర్తీ సురేష్‌ను సావిత్రి రోల్ కోసం ఎంచుకున్నారని సమాచారం. 
 
ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఇప్పటికే కసరత్తులు చేస్తున్న అశ్విన్.. నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. సావిత్రి కోసం తొలుత సమంత, నిత్యమీనన్‌లను అనుకున్న అశ్విన్.. ఆపై సమంతను ఫిక్స్ చేశారని తెలిసింది. కానీ ఉన్నట్టుండి ప్రస్తుతం సీన్ మారిపోయింది. సావిత్రి పాత్ర కోసం సమంతని కాదని, కీర్తి సురేష్‌ని అశ్విన్ ఎంపిక చేశారు. 'నేను శైలజ'తో ఆకట్టుకొన్న కీర్తి సావిత్రి సినిమా అనగానే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ నిర్మిస్తారు. 

వెబ్దునియా పై చదవండి