ప్రభాస్‌ను లైన్లో పెట్టిన హీరోయిన్... ఆ మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన బాహుబలి...

బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:29 IST)
హీరో ప్రభాస్. టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్. ఈ కుర్రోడిని వివాహం చేసుకునేందుకు అనేక మంది యువతులే కాదు.. హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ టాలీవుడ్ కుర్ర హీరోయిన్ మాత్రం ప్రభాస్‌ను లైన్లో పెట్టేసింది. 
 
"ధోని" హీరోయిన్ కియారా అద్వానీ. ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినప్పటికీ.. హీరోయిన్‌ నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈమె ప్రభాస్‌పై మనసు పారేసుకుందట. దీంతో తన మనసులో మాట చెప్పేందుకు ప్రభాస్‌ను కలిసి చెప్పేందుకు పలు మార్లు ట్రై చేసింది. 
 
కానీ, అది సాధ్యపడలేదు. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరో ద్వారా ప్రభాస్ నంబర్ సంపాదించి అతడికి మెసేజ్ పెట్టేసిందట. ఏమని ఆమె మెసేజ్ పెట్టిందో తెలియకపోయినా.. ఆ మెసేజ్‌కు మాత్రం ప్రభాస్ రిప్లై ఇచ్చాడట. అలా ప్రభాస్‌ను అద్వానీ బుట్టలో వేసుకుందట. 

వెబ్దునియా పై చదవండి