పవన్ కళ్యాణ్ 'ప్రజల మనిషి'... ఆయన కోసం కథ రాస్తున్నా... రాజమౌళి తండ్రి

సోమవారం, 29 మే 2017 (18:29 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నటుడిగా కంటే కూడా వ్యక్తిగా తనకు ఎంతో ఇష్టమని సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు... పవన్ కళ్యాణ్ తను అనుకున్న మార్గాన్ని తప్పకుండా ముందుకు సాగుతారనీ, ఆ మార్గంలో ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొనే తత్వం చూస్తే ముచ్చటేస్తుందని అభిప్రాయపడ్డారు. 
 
అలాంటి వ్యక్తి తను అనుకున్నది సాధించేందుకు ఎంతదూరమైనా వెళతారని అన్నారు. అలాంటి ప్రజల మనిషి కోసం ఓ కథను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. మరి ఈ కథ పవన్ కళ్యాణ్ కు వినిపిస్తే, ఆ కథ నచ్చితే దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ప్రశ్న. 
 
కాగా విజయేంద్ర ప్రసాద్ కథ మామూలుగా వుండదు, అది కూడా జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో వున్న ఫాలోయింగును దృష్టిలో పెట్టుకుని కథ రాసే అవకాశం వుంటుంది. అదే జరిగితే, ఆ కథనే తెరకు ఎక్కిస్తే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో మైలేజి పెరగడం ఖాయం. విజయేంద్ర ప్రసాద్ అన్నట్లే పవన్ కళ్యాణ్ ఎక్కడికో వెళ్లడమూ ఖాయమే. మరి ఇది 2019 లోపే జరుగుతుందో లేదో చూడాల్సి వుంది.

వెబ్దునియా పై చదవండి