మళ్ళీ 'ఎవడు' జోడీ... శ్రుతి హాసన్ కు లక్కీ చాన్స్

బుధవారం, 20 ఆగస్టు 2014 (12:40 IST)
రామ్‌ చరణ్ సరసన కాజల్‌ హిట్‌ పెయిర్‌గా వుంది. అయితే గబ్బర్‌ సింగ్‌తో గోల్డెన్‌ లెగ్‌గా మారిన శ్రుతి హాసన్‌తో.. రామ్‌చరణ్‌ జోడీ కట్టి 'ఎవడు'లో అలరించింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌ రానున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది. 
 
దానయ్య నిర్మాత. ఇప్పటికే దానయ్య కార్యాలయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రామ్‌ చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథను సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రముఖ రచయితలు కూడా ఇన్‌వాల్వ్‌ అవుతున్నారని తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి