హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని - ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ రెడ్డిల వివాహం రద్దు కావడానికి కారణం వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్తల్లో ఏ మేరకు నిజం ఉందో తెలియదు. కానీ, అఖిల్తో బ్రేకప్ కాగానే, ఓ ఎన్నారైతో శ్రియా పెళ్లి ఫిక్సయిందన్న వార్తలూ వచ్చేశాయి.
వాస్తవానికి వెంటనే పెళ్లి చేసుకోవాలని శ్రియా భూపాల్ ఇంటి తరపు నుంచే ఒత్తిడి ఎక్కువైందట. అయితే.. నటుడిగా తన కెరీర్ ఏంటో అప్పటికీ సందిగ్ధంలోనే ఉండటంతో అఖిల్ తొలుత పెళ్లికి వెనుకాడడట. కెరీర్ కాస్తంత గాడిన పడిన తర్వాత పెళ్లి చేసుకుందామని వారికి చెప్పాడట. అయినా.. పెళ్లి కూతురు తరపు వారు ఒప్పుకోకపోవడంతో పెళ్లికి సిద్ధమయ్యాడట.
ఇదే విషయం మరోసారి వారి మధ్య చర్చకు రావడంతో.. శ్రియా భూపాల్ కుటుంబ సభ్యులు నాగ్ ఫ్యామిలీతో చర్చలు జరిపారట. అయితే.. అఖిల్ రెండో సినిమా విడుదలయ్యాక పెళ్లి చేద్దామని నాగ్ చెప్పినా వారు వినిపించుకోలేదట. అదేవారి మధ్య అభిప్రాయ భేదాలకు కారణమై అఖిల్-శ్రియల పెళ్లి ఆగిపోవడానికి కారణమైందని టాక్. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది.