పెళ్లైన నటుడితో సాయిపల్లవి ప్రేమాయణం.. బాలీవుడ్ టార్గెట్ చేస్తుందా?

సెల్వి

శుక్రవారం, 26 జులై 2024 (14:30 IST)
బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్‌లు ప్రస్తుతం దక్షిణాది నటి సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నాయి. పెళ్లయిన నటుడితో నటి సాయి పల్లవి ప్రేమాయణం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సాయి పల్లవికి ఇబ్బంది కలిగిస్తుంది.
 
ప్రస్తుతం రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ సరసన సాయి పల్లవి సీతగా నటించడం ఇష్టం లేని కొంతమంది బాలీవుడ్ నటీమణులు తమ పిఆర్ టీమ్‌లను ఉపయోగించి సాయిపల్లవిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సాయిపల్లవి ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించకోవట్లేదు.
 
అసూయ పోటీ కారణంగా ఈ గాసిప్ చక్కర్లు కొడుతున్నట్లు కనిపిస్తోంది. అలాగే సాయి పల్లవి అభిమానులు ఆమెకు మద్దతు ఇస్తున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం కంటే ఆమె నటనా ప్రతిభపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు