'స్పైడర్' బిజినెస్ రూ.124 కోట్లు.. కలెక్షన్లు రూ.55 కోట్లు... భారీ నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్లు

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (11:14 IST)
దసరా పండగకు విడుదలై సందడి చేస్తున్న చిత్రాల్లో మహేష్ బాబు నటించిన 'స్పైడర్' ఒకటి. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.124 కోట్ల మేరకు బిజినెస్ చేసింది. కానీ, కలెక్షన్ల పరంగా తుస్‌మనిపించింది. 
 
భారీ అంచనాల మధ్య విడుదైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది. కానీ ఆ తర్వాత చాలా వేగంగా ఈ సినిమా వసూళ్లు పడిపోతూ వచ్చాయి. దాంతో పంపిణీదారులకు భారీ నష్టాలు తప్పవనేది ట్రేడ్ వర్గాల మాట.
 
దాదాపు ఈ సినిమా రూ.124 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది. తొలి వారాంతంలో రూ.45 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. రెండోవారం .. మూడోవారంలోనీ కలుపుకుని ఈ సినిమా మరో రూ.10 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అంటున్నారు. 
 
ఆవిధంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.55 కోట్ల షేర్ మాత్రమే ఉండే అవకాశం ఉందనేది ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ. స్టార్ హీరోలకి అప్పుడప్పుడు ఇలాంటి పరాజయాలు ఎదురుకావడం సహజమేననే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు