సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న రాజమౌళి... ఏప్రిల్‌లో 'ఆర్ఆర్ఆర్'

సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:31 IST)
వచ్చే యేడాది సంక్రాంతి రేస్ నుంచి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తప్పుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న "ఆర్ఆర్ఆర్" (రౌద్రం - రణం - రుధిరం) చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే జూలై 30వ తేదీన విడుదల చేయాలని తొలుత ప్రకటించారు. అయితే, హీరోయిన్ల ఎంపికతో పాటు.. గ్రాఫిక్స్ వర్క్స్, చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరోలు షూటింగ్‌లో గాయపడటం వంటి కారణాల రీత్యా వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 
 
అయితే, ఇపుడు కరోనా వైరస్ కారణంగా చిత్ర షూటింగా ఆగిపోయింది. ప్రస్తుతం 75 శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ.. మిగిలిన షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి చేయాల్సివుంది. ఇక్కడే జాప్యమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే గ్రాఫిక్స్ పనులన్నీ విదేశీ కంపెనీలే చేయాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. 
 
ఫలితంగా సంక్రాంతి రేస్ నుంచి తప్పకున్న వేసవి సెలవులను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే వచ్చే యేడాది ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తుండగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు