అనసూయకు 3 లక్షల మంది వార్నింగ్... ఎందుకు..!

ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (13:24 IST)
తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 3 లక్షలకుపై మంది వార్నింగ్ ఇస్తూ మెసేజ్‌లు చేశారు. అది కూడా "అర్జున్ రెడ్డి" సినిమా వ్యవహారంలో అనసూయ స్పందించిన తీరుపైనే. సినిమా యువకులపై ప్రభావం చూపేలా ఉంది... ఇలాంటి సినిమా అస్సలు రాకూడదంటూ బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 
 
అనసూయ చేసిన ట్వీట్‌కు 3 లక్షల మందికిపైగా అభిమానులు మెసేజ్ లు చేశారట. ముందు నువ్వు సరిగ్గా బట్టలు కట్టుకో.. నీతులు చెప్పే ముందు నీ నీతి ఎంత మాత్రం ఉందో తెలుసుకో.. 'జబర్దస్త్' షోలో షేకింగ్ శేషుతో సెక్స్ చాట్ చేసిన విషయం మరిచిపోయావా. 
 
నాది లేస్తుంది.. నీది పడుకుంటుంది అని షేకింగ్ శేషు అన్నప్పుడు ముసి ముసి నవ్వులు నవ్విన నువ్వు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు...అంటూ వివిధ ప్రశ్నలతో అనసూయపై మెసేజ్‌లో చేశారు. దాంతో అనసూయ ఆ మెసేజ్ లను చూడడమే మానేసిందట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు