తన గురించి ఎవరేమనుకున్నా... నా తల పొగరు ఏమాత్రం తగ్గదని మలయాళ బ్యూటీ నిత్యామీనన్ స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్ నిర్మిస్తున్న సావిత్రి చిత్రంలో హీరోయిన్గా నిత్యామీనన్ ఎంపికైన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ విషయంలో తలతిక్క వేషాలు వేస్తుండటంతో అమ్మడుకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా, హీరో దుల్కర్ సల్మాన్తో ప్రేమాయణం నడుపుతోందనీ, నిత్య కారణంగా ఆ హీరో కాపురంలో చిచ్చు రగిలిందనీ, ఆ హీరోగారింట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయనీ తమిళ తంబీలు అంటున్నారు. వీటిపై ఆమె ఘాటుగానే స్పందించారు.