మాకంటే వారికే పదిరెట్లు ఎక్కువ: తాప్సీ

శుక్రవారం, 22 జూన్ 2012 (13:39 IST)
ఒకప్పుడు నటి చార్మి లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలు చేసినా... పారితోషికం పెద్దగా ముట్టేది కాదని అనేది. ఇప్పుడు అదే మాటను తాప్సీ అంటుంది. "ఎప్పుడైనా కథానాయిక పాత్రలను మలిచే రచయితలు ఉంటే... శ్రీదేవి, విజయశాంతి, అనుష్క వంటి నటీమణులు వెలుగులోకి వస్తారు. అలాంటి పాత్రలు వేస్తేనే మాకూ ఆనందంగా ఉంటుంది. ధైర్యంగా మరో ముందగుడు వేస్తాం" అంటోంది తాప్సీ. 

"హీరోల చుట్టూ కథ తిరిగితే... వారికి మాకంటే పదిరెట్లు పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఏ భాషలోనైనా ప్రతిభావంతులైన రచయితలు, దర్శకులున్నారు. తెలుగులోనూ ఉన్నారు. కానీ హీరోల చుట్టూ కథలకే పరిమితం అవుతున్నార"ని చిన్న జలక్‌ కూడా ఇచ్చింది. లేటెస్ట్‌గా షాడో, గుండెల్లో గోదారి చిత్రాల్లో తాప్సీ నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి