రూ.200 కోట్ల భారీ మోసం: మద్రాస్ కేఫ్ హీరోయిన్ లీనా అరెస్ట్

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (12:38 IST)
Leena Maria Paul
బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న రూ.200 కోట్ల భారీ మోసం కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సుకేశ్ చందశేఖర్ స్నేహితురాలు లీనా మరియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో లీనాను అరెస్టు చేశారు. 
 
లీనా పాల్ చంద్రశేఖర్.. జాన్ అబ్రహంతో కలిసి 'మద్రాస్ కేఫ్' మూవీలో నటించింది. భర్త జైలులో ఉండగా.. బయట నుంచి ఈ దోపిడీకి ప్లాన్ చేసినది లీనానే అని పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెపై గతంలో కూడా కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల కమిషన్ లంచం కేసుతో సహా 21 కేసుల్లో నిందితుడైన చంద్రశేఖర్ గత ఆగస్టులో అరెస్టు అయ్యాడు. 
 
ఈ నేపథ్యంలో సుకేశ్ బంగ్లాపై దాడి చేసి కోట్లు విలువైన వస్తువులను, అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు..16 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సుకేశ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అతను జైలులో కూర్చునే ఈ రాకెట్‌ను నడిపించడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు