నాలుగో పెళ్లికి సిద్ధమైన తెలుగు హీరో.. మూడో భార్యకు ఇచ్చిన భరణం ఎంత?

మంగళవారం, 3 జనవరి 2023 (09:13 IST)
టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి పవిత్రా లోకేష్‌తో కలిసి ఏడు అడుగులు నడువనున్నారు. ఈ విషయాన్ని వారిద్దరూ కొత్త సంవత్సరం రోజున అధికారికంగా వెల్లడించారు. 
 
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వారిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ సన్నిహితంగా ఉన్న వీడియోను రిలీజ్ చేసి, తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు నిర్ధారించారు. ఇది నరేష్‌కు నాలుగో పెళ్లి కాగా, నటి పవిత్రా లోకేష్‌కు ఇది మూడో పెళ్లి. ఇపుడు వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారు. 
 
మరోవైపు, నరేష్ మూడో భార్య సంగతేంటి అన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు తన భర్త కోసం పోరాటం చేసిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. ఇపుడు ఉన్నట్టుండి సైలెంట్‌ అయిపోయారు. అంటే, ఆమెకు భారీ మొత్తంలోనే నరేష్ భరణం చెల్లించివుంటారని కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఈ చెల్లించిన మొత్తం ఎంత అన్నదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు.. మూడో భార్యకు నరేష్ ఏకంగా రూ.5 కోట్ల మేరకు భరణం చెల్లించినట్టు సమాచారం. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, న్యాయవాదుల సమక్షంలో ఈ సెటిల్మెంట్ జరిగినట్టు వికికిడి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు