సీఎం జగన్ 3 రాజధానులపై నటి షకీలా పంచ్ డైలాగ్- video

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (13:53 IST)
ఏపీ సీఎం జగన్ పైన షకీలా పంచ్ డైలాగ్
రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను సినిమాల్లో పంచ్‌లుగా గట్టిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ మూడు రాజధానులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఏపీకి మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే టాపిక్‌పై జగన్‌కు పంచ్ వేశారు నటి షకీలా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం.
 
వి.ఎన్ సతీష్ దర్శకత్వం వహించారు. నిన్న ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. షకీలా పేపర్ చదువుతూ ఆంధ్రాకి మూడు రాజధానులు అని పేపర్‌లో రాసిన వార్తను చదివి షకీలా ఆశ్చర్యపోవడంతో టీజర్ మొదలైంది. ఆంధ్రాకి మూడు రాజధానులేంటి అని తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. ఇందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ.. అవును మేడమ్. జగన్ అన్న మూడు రాజధానులు చేసేశాడుగా అంటాడు. 
 
దీంతో షకీలా ఒక్క స్టేట్‌కే మూడు రాజధానులా? పోనుపోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యపోనవసరం లేదు అని పంచ్ వేశారు. ఈ సినిమాలో విక్రాంత్ పల్లవి ఘోష్ జంటగా నటించారు. 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌ పైన సతీష్ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించారు. కానీ ఈ సినిమాకు కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలుపుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినిమా యూనిట్ సభ్యులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు