తమన్నాను ఉసిగొల్పి శవాల మీద పేలాలు ఏరుకోకండి.. శ్రీరెడ్డి తాజా ట్వీట్

శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:20 IST)
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ ఓ రేంజ్‌లో పేలిపోయాయి. ఆ తర్వాత తాను చేసిన తప్పుకు సారీ చెప్పింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ముంబైకి చెందిన హిజ్రా తమన్నాను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇదే అంశంపై ట్వీట్ చేసింది. "తమన్నాను ఎవరు పంపించారో మాకు తెలుసు. వెన్నుపోటు రాజకీయంలో దిట్ట. దొంగలకి తాళాలు ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్‌తో ఎంకరేజ్ చేయకండి. నిజాలు ఏంటో తెలియకుండా ప్రసారం చేయకండి. హిజ్రా జాతి అతన్ని వెలివేశాయి విజయవాడలో. అతనిప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు. శవాల మీద పేలాలు ఏరుకోకండి అసహ్యంగా" అంటూ పోస్ట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు