"ఆదిపురుష్‌"కు యు సర్టిఫికేట్... రన్ టైమ్ ఎంతో తెలుసా?

గురువారం, 8 జూన్ 2023 (16:08 IST)
హీరో ప్రభాస్ - హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది., ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యుల బృందం "యు" సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. అలాగే, ఈ చిత్రం నిడివి కూడా 2 గుంటల 59 నిమిషాలు. 
 
టాలీవుడ్‌లో చాలా తక్కువ చిత్రాలు ఇంతటి రన్‌టైమ్‌ (సుమారు 3 గం.)తో తెరకెక్కాయి. కంటెంట్‌ బాగుంటే సినిమా ఎన్ని గంటలున్నా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం.. నాటి 'దానవీర శూర కర్ణ' నుంచి గతేడాది వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' వరకు నిరూపితమైంది. 
 
రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా కనిపించనున్నారు. రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ నటించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్‌ 16న విడుదలకానుంది. 
 
ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల విక్రయంలో అటు చిత్ర బృందం, ఇటు ఈ సినిమాలో భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు