అవును.. మేమిద్దరం విడిపోయాం.. ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య

సెల్వి

సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:32 IST)
నటుడు, నిర్మాత ధనుష్, దర్శకురాలు, రజనీకాంత్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ జంట ఇటీవల చెన్నై ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టం, 1955 (పరస్పర అంగీకారంతో విడాకులు) సెక్షన్ 13B కింద విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 2022లో, ధనుష్, ఐశ్వర్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ధనుష్ ఇలా వ్రాశాడు: "పద్దెనిమిది సంవత్సరాల పాటు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరికొకరు వత్తాసుగా వున్నాం. ప్రస్తుతం మన మార్గాలు వేరు చేసే ప్రదేశంలో నిలబడి ఉన్నాం. ఐశ్వర్య, నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము." అంటూ ప్రకటించారు. 
 
2004లో వివాహం చేసుకున్న ధనుష్- ఐశ్వర్యలకు ఇద్దరు కుమారులు. సినిమాల సంగతికి వస్తే.., ఐశ్వర్య 'లాల్ సలామ్'తో దర్శకురాలిగా తిరిగి వచ్చింది, ఇందులో ఆమె తండ్రి రజనీకాంత్ అతిధి పాత్రలో నటించారు. ధనుష్ తాజా విడుదల 'కెప్టెన్ మిల్లర్', అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్ చిత్రం సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు