నటి సుప్రీతపై నటుడు అమర్ దీప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె తనకు చేసిన సాయాన్ని బహిర్గతం చేశారు. గోవాలో మద్యం సేవించి పడిపోతే, సుప్రీత తనను హోటల్ గదికి చేర్చారని తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమర్ దీప్ స్పందిస్తూ, షూటింగ్ సమయంలో తామిద్దరం చాలా క్లోజ్ అయ్యామని, స్క్రిప్ట్ డిస్కషన్స్ కోసం సిట్టింగ్ కూడా చేస్తుంటామని అమర్ దీప్ తెలిపారు. ఒకసారి తన ఫ్రెండ్స్తో తాను, సుప్రీంత ఫ్రెండ్స్త ఆమె సపరేట్గా గోవాకు వెళ్లామని చెప్పారు.
గోవాలో తాము అనుకోకుండా కలిశామని, ఆ రాత్రి తాను ఫుల్గా తాగిపడిపోతే తెల్లారి 9 గంటలకు సుప్రీత తనను తన రూమ్ వద్ద డ్రాచ్ చేసిందని తెలిపారు. సుప్రీత తల్లి సురేఖతో కూడా తనకు చనువు ఉందని, ఆమెను తాను అక్క అని పిలుస్తుంటానని చెప్పారు. వాళ్లతో ఉన్న అనుబంధం విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పారు.
భారత రహదారులపై పరుగులు పెట్టనున్న టెస్లా కారు
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైనా టెస్లా కంపెనీ భారత్లో తన షోరూమ్ను తెరిచింది. దేశ రాజధాని ఢిల్లీలో తన రెండో షోరూమ్ను తెలిసింది. దాదాపు 8,200 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
అలాగే, సాకేత్, నోయిడా, ఆరిజన్ తదితర ప్రాంతాల్లో ఈ సూపర్ చార్జర్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ముంబైలో తొలి షోరూమ్ను ఓపెన్ చేసిన టెస్లా.. కొన్ని రోజుల క్రితమే మొదటి సూపర్ ఛార్జర్ స్టేషన్ను ప్రారంభించింది. హైదరాబాద్, పూణె, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జయపుర వంటి 8 నగరాల్లోనూ ఛార్జింగ్ నెట్వర్క్ను విస్తరించనుంది.
దేశీయ మార్కెట్లో దీనిని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డబ్ల్యూడీ వేరియంట్ ప్రారంభ ధర రూ.59.89 లక్షలు, లాంగ్ రేంజ్ మోడల్ ధర రూ.67.89 లక్షలుగా కంపెనీ తెలిపింది. ఈ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 500-600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని తెలిపింది.