అసత్య వార్తలు నమ్మి నాకు ఫోన్ చేయకండి... కరోనా సోకలేదు : యాంకర్ ఝాన్సీ

ఆదివారం, 5 జులై 2020 (12:02 IST)
బుల్లితెర ప్రముఖ యాంకర్ ఝాన్సీకి కరోనా వైరస్ సోకిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, బుల్లితెరకు చెందిన పలువురు నటీనటులకు కూడా ఈ వైరస్ సోకింది. అదేకోవలో యాంకర్ ఝాన్సీకి కూడా ఈ వైరస్ సోకినట్టు వార్తలు వచ్చాయి.
 
తాను హోస్ట్‌గా ఉన్న వ్యవహరిస్తున్న 'పరివార్ సీజన్ 2' కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో కరోనా ఉన్న వారితో కలిసి పని చేయడం వల్ల ఆమెకు కూడా వైరస్‌ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించి స్పష్టతనిచ్చారు. 
 
తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, అసత్య వార్తలు నమ్మి తనకు ఫోన్లు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వా‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, షూటింగుల్లో పాల్గొంటోన్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు