తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యాంకర్ రష్మీ ఇటీవల ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఈ కారులో ఆమె వెళుతుండగా, విశాఖ జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 11 సమయంలో జరిగింది.