తన తొలి సినిమా 'సినిమా బండి' ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం 'పరదా'తో వస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత వంటి అద్భుతమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాపులరైన రాజ్, డికె ఈ చిత్రానికి మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.