ఈ యూనిట్లు 2034 నాటికి నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉద్యోగాలను సృష్టిస్తాయి. ఎలక్ట్రానిక్ తయారీ పర్యావరణ వ్యవస్థను పెంచుతాయి. అదే సమయంలో అనేక పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయి. తాజా అనుమతులతో, ఐఎస్ఎం కింద ఆమోదించబడిన మొత్తం ప్రాజెక్టుల సంఖ్య పదికి చేరుకుంది.
కేంద్రం ఆరు రాష్ట్రాలలో రూ.1.60 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మంగళవారం, SiCSem, కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 3D గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్., అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ నుండి ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.
ఆటోమోటివ్, టెలికాం, డేటా సెంటర్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో చిప్లకు డిమాండ్ పెరుగుతున్నందున, కొత్త సెమీకండక్టర్ యూనిట్లు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం వైపు ఒక అడుగు వేసినట్లైంది.
దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏఎస్ఐపీ ఆంధ్రప్రదేశ్లో తన తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. ఇది మొబైల్ ఫోన్లు, సెట్-టాప్ బాక్స్లు, ఆటోమొబైల్ సిస్టమ్లు, ఇతర ఉత్పత్తులలో ఉపయోగించడానికి ఏటా 96 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది.