Chandrababu, Venkataramana Pasupuleti
తెలుగు రాజకీయ, సినీ రంగాల్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ధర్మచక్రం. ఈ సినిమాను నిస్వార్థ సేవా దృక్పథంతో స్థాపితమైన SIFAA సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థను స్థాపించిన వ్యక్తి, గత ముప్పై ఏళ్లుగా సొంత ఖర్చులతో, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్మచక్రం సినిమా షూటింగ్ పూర్తయినట్లు SIFAA సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.