బాహుబలి రిలీజ్కు ముస్తాబవుతోంది. రాజమౌళి భారీ బడ్జెట్ మూవీ సినిమా ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనుల్లో ఉంది. ఎంఎం కీరవాణి, రాజమౌళి ఈ సినిమా రీ-రికార్డింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. బాహుబలి ది బిగినింగ్ తొలి పార్ట్కు అడ్వాన్స్ సౌండ్ టెక్నాలజీని అందిస్తున్నట్లు రాజమౌళి టీమ్ సమాచారం. కాగా బాహుబలి జూలై పదో తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్కలు సినిమా ప్రమోషన్లో బిజీ బిజీగా ఉన్నారు.