కేన్స్ ఉత్సవంలో బాహుబలి: జర్మనీలో ఫట్ అయిన జక్కన్న సినిమా

మంగళవారం, 10 మే 2016 (10:31 IST)
ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లలో అదరగొట్టిన బాహుబలి సినిమాను కేన్స్‌లోని మార్షెడూ ఫిలిమ్ వేదికపై ప్రదర్శించనున్నారు. ఇంకా జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాను ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించిన నేపథ్యంలో.. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక విలువలపై వెరైటీ సంస్థ, ఏషియ‌న్ బ్యూరో చీఫ్ ప్యాట్రిక్ ఆధ్వ‌ర్యంలో చర్చ సాగనుంది. 
 
మే 16న జరిగే ఈ చర్చకు హాజరు కావాలని చిత్ర దర్శకులు రాజమౌళితో పాటు నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌, చిత్రం కోసం పని చేసిన రేడియాన్ టెక్నాలజీ గ్రూప్ సీనియ‌ర్‌ వైస్ ప్రెసిడెంట్ రాజా కోడూరిల‌కు ఆహ్వానం అందింది. ఈ చర్చకు అనంతరం కేన్స్‌లోని మార్షెడూ ఫిలిమ్ వేదికపై బాహుబలి సినిమాను ప్రదర్శించనున్నారు. చ‌ర్చ సంద‌ర్భంగా బాహుబ‌లి చిత్రానికి వాడిన టెక్నాల‌జీని రాజ‌మౌళి వివ‌రించ‌నున్నారు.
 
ఇకపోతే అంతర్జాతీయ భాషల్లో అనువాదం చేయించి.. రిలీజైన బాహుబలి చిత్రానికి కొన్ని భాషల్లో మంచి స్పందన వచ్చినా.. జర్మనీలో మాత్రం జక్కన్న సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని జర్మనీలో 30 స్క్రీన్లలో బాహుబలిని రిలీజ్ చేశారు. అయితే జర్మనీలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. బాహుబలి'తో పాటు బాలీవుడ్ మూవీ 'బాజీ రావు మస్తానీ' మూవీ కూడా జర్మనీలో నష్టాలనే మిగిల్చడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి