'ఆదిపురుష్‌'కు కష్టాలు.. చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రధానికి లేఖ

మంగళవారం, 20 జూన్ 2023 (14:15 IST)
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో హీరో ప్రభాస్ - హీరోయిన్ కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ నెల 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్ర కథ అసలైన రామాయణంకు చెందిన స్టోరీ కాదని, నిజ స్టోరీని వక్రీకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. 
 
సినిమా స్క్రీన్‌ప్లే, డైలాగులు రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. వెంటనే సినిమాను నిలిపివేయాలని ఆ లేఖలో కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఐటీ శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్‌కు అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యాంలాల్ గుప్తా ఓ లేఖ రాశారు. అంతేకాకుండా, ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌, సంభాషణ రచయిత మంటసిక్ శుక్లా, నిర్మాతపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశాలని ఆయన డిమాండ్ చేశారు.
 
'ఆదిపురుష్‌' హిందువుల మనోభావాలను, సనాతన ధర్మాన్నీ తీవ్రంగా దెబ్బతీసేలా ఉంది. శ్రీరాముడు అందరికీ దేవుడు. ఈ సినిమాలోని డైలాగులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడిని బాధపెట్టేలా ఉన్నాయి. దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా చిత్రీకరించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి అవమానకరమైన చిత్రం భాగం కాకూడదు. శ్రీరాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ సినిమా పూర్తిగా విధ్వంసం చేసింది. దీనిని వెంటనే నిలివేయండి. భవిష్యత్తులో ఓటీటీలో కూడా దీనిని ప్రదర్శించవద్దు. ఈ మేరకు ఆదేశించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం' అని లేఖలో పేర్కింది. ‘ఆదిపురుష్‌’ దర్శకుడు, రైటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు