టిఆర్‌పికి కేరాఫ్ అడ్రస్ ఈ బుల్లితెర జంట...బిగ్ బాస్-3కి ఒప్పుకుంటారా?

బుధవారం, 29 మే 2019 (18:38 IST)
వరుసగా రెండు సీజన్ల పాటు మంచి టిఆర్‌పితో సాగిన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్నందున హౌస్‌లో ఎంటర్ కాబోయే సెలబ్రేటీలు ఎవరనే విషయంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సీజన్‌ను ఇంకా బాగా రక్తి కట్టించాలనే ఉద్దేశ్యంతో జబర్దస్త్, ఢీ షోల ద్వారా పేరు పొందిన సుడిగాలి సుధీర్, రష్మిలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
 
జబర్దస్త్, ఢీ షోలతో సుధీర్, రష్మిల జోడీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇద్దరి మధ్య లవ్ ఉందనే ఎఫైర్ ఒకపక్క చక్కర్లు కొడుతుంటే మరోవైపు ఇది నిజమేమో అనిపించేలా ఇద్దరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఇతర సభ్యులు కూడా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే విధంగా కామెంట్స్ చేయడం జరుగుతోంది. గతంలో ఓ సందర్భంలో నిర్వాహకులు వీరిద్దరికీ పెళ్లి కూడా చేశారు. 
 
వీరిద్దరూ ఉన్నారంటే సందడి, వినోదానికి కొరతే ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ జంట బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలో ఉంటే ఖచ్చితంగా రేటింగ్స్‌కు రెక్కలు రావడం ఖాయం. అందుకే వీరిని ఎలాగైనా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట షో నిర్వాహకులు. అయితే ప్రస్తుతం వారిద్దరి కెరీర్ పీక్‌లో నడుస్తోంది. 
 
టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ 90 రోజుల పాటు సాగే బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకురావడం అంటే నిర్వాహకులు భారీ స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది, కనుక ఇది సాధ్యపడదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను ఫైనలైజ్ చేసిన ఈ షోకి ఈ సారి నాగార్జున హోస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు