AI వెర్రితలలు, మొన్న రష్మిక మందన, నేడు అలియా భట్ డీప్ ఫేక్ వైరల్

సోమవారం, 27 నవంబరు 2023 (13:14 IST)
AI టెక్నాలజీ వెర్రితలలు బయటపడుతున్నాయి. ఆ టెక్నాలజీతో చేయాల్సిన మంచిపనులు కన్నా చెడ్డవి బాగా వైరల్ అవుతున్నాయి. ఆమధ్య ఈ టెక్నాలజీతో రష్మిక మందన డీప్ ఫేక్ నెక్ దుస్తుల్లో వున్నట్లు వీడియో సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. దానిపై దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఫేక్ వీడియోలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.
 
అదలావుండగానే తాజాగా మరో డీప్ ఫేక్ ఫోటో వైరల్ అవుతుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ డీప్ ఫేక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె పూలపూల దుస్తులు ధరించి వున్నట్లు సృష్టించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు