కిర్రాక్ ఆర్ఫీ ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడు.. లుచ్చా మాటలు ఎందుకు?

శుక్రవారం, 15 జులై 2022 (16:30 IST)
Kiraak RP
జబర్దస్త్ ప్రోగ్రాం నిర్మించిన నిర్మాణ సంస్థ మల్లెమాలపై చాలా రకాలుగా ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించాడు కిర్రాక్ ఆర్ఫీ. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించాడు. 
 
కిర్రాక్ ఆర్ఫీ చేసిన కామెంట్లను తప్పుబడుతూ తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు నిర్మాత చిట్టిబాబు. ఓ అడ్రస్ లేని వాడిని తీసుకుని వచ్చి ఆర్టిస్ట్‌గా చేసింది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ గురించి తప్పుగా మాట్లాడుతున్న ఆర్ఫీ తినేది అన్నమేనా? అంటూ ఫైర్ అయ్యారు.
 
కిరాక్ ఆర్పీ ఓ విశ్వాస ఘాతకుడు అంటూ ఓ వీడియో ద్వారా విరుచుకుపడ్డాడు నిర్మాత చిట్టిబాబు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే దౌర్భాగ్యుడు.. అన్నం తినేవాడు ఎవ్వడూ కూడా ఇలా మాట్లాడడు.. అన్నం పెట్టిన చేతిని నరికేసే నీచుడు అంటూ ఆర్ఫీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
అన్నం పెట్టిన సంస్థను అల్లరిపాలు చేసే వాళ్ళను తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే వాళ్లనే కదా అనాలి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చిట్టిబాబు. ఇప్పుడు వేరే ఛానల్‌కి వెళ్లి.. ఇలాంటి నీఛపు మాటలు.. లుచ్చా మాటలు ఎందుకు? ఒళ్లు బలిసి మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు