కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

ఐవీఆర్

శుక్రవారం, 16 మే 2025 (14:06 IST)
టాలీవుడ్ హీరో అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను గురువారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఐతే ఏంటంటా అనుకునేరు. ఈ టీజర్ విడుదల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తళుక్కున మెరిసింది.
 
రమ్య అక్కడకి ఎందుకు వచ్చిందయా అంటే... ఆమె ఈ చిత్రంలో నటిస్తోందట. బాగా గుర్తింపు వున్న పాత్రలో నటిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తన ఇన్ స్టాగ్రాం పేజీలో వేసే స్టెప్పులు, పెట్టే రీల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు. ఐతే రమ్య మాత్రం వాటిని అస్సలు పట్టించుకోదు. తను ఏం చేయాలనుకుంటుందో అది చేస్తూ వెళ్లిపోతుంటుంది.
 
ఇప్పుడు రమ్యకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం రావడం పట్ల ఆమె అభిమానులు కంగ్రాట్స్ చిట్టి పచ్చళ్ల రమ్యా... మీకు మరిన్ని అవకాశాలు రావాలి, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి అంటూ విషెస్ చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు