"ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్" అంటూ హెచ్చరించాడు. భాష తెలీయకపోయినా ఆయన నవ్వుకున్నారు. ఇక ఫంక్షన్ అయ్యాక రాత్రి రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలకు ఇంగ్లీషులో డేవిడ్ కు దర్శకుడు వివరిస్తూ ఫోన్ లో వివరించారు. దానికి ఆయన నవ్వి చాలా తేలిగ్గా తీసుకున్నారట.
క్రికెట్ లో ఇంతకంటే ఎక్కువగా తిడుతుంటారు. కామెంట్ చేస్తుంటారు. ఎమోషన్ అయ్యేలా మాట్లాడుతుంటారు. నటుల్లో కూడా ఇలా వుంటారా? అని డేవిడ్ అన్నారనీ, ఆయన స్పోర్టివ్ గా తీసుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని దర్శకుడు వెంకీ కుడుముల ఈరోజు ఇంటర్యూలో క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన శ్రీలీల, కేతికశర్మలు హీరోయిన్లుగా నటించగా, ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది.