కత్తి మహేష్‌పై క్రిమినల్ కేసు... ఎందుకో తెలుసా?

శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:15 IST)
ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని రహ్మత్‌ నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఈ తరహా కేసును నమోదు చేశారు.
 
గత జూన్ నెల 29వ తేదీన ఓ టీవీ ఛానల్‌లో జరిగిన చర్చలో శ్రీరాముడు, సీతపై మహేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలనే ఆయన మరోమారు ప్రస్తావిస్తూ ఫిర్యాదుచేశారు. 
 
ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మహేశ్‌ మాట్లాడినట్లు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై తొలుత న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. ఐపిసి 295 (ఎ), 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
కాగా, ఈ వ్యాఖ్యల కారణంగా కత్తి మహేష్‌పై హైదరాబాద్ నగర పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయనన కొద్ది రోజులుగా తన సొంత జిల్లా చిత్తూరులో ఉంటూ వచ్చారు. ఇటీవలే తన నివాసాన్ని విజయవాడకు మార్చుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు