పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి వస్తుండగా ఓజీ చిత్రంతో పాటు మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ సినిమాలో శ్రీలీల నాయిక. కాగా, మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా నటిస్తుంది. ఈమె ఈరోజే తమ యూనిట్ లోకి ఆహ్వానిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. దేవదూత రాశిఖన్నాను శ్లోకా గా ఎంట్రీ ఇస్తున్నట్లు కాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుగుతోంది.