అనుష్కను చూసి ''అబ్బా'' అంటున్న పూరీ జగన్నాథ్..!

శుక్రవారం, 24 జులై 2020 (11:22 IST)
అవును.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టిపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా అడుగు పెట్టింది అనుష్క. ఈ సందర్భంగా ''సూపర్'' సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయ్యింది.
 
ఈ సందర్భంగా పూరి ట్విట్టర్ ద్వారా స్పందించారు. "అనుష్కను మొదటిసారి చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని కింగ్ నాగార్జున చెప్పారు. మా అనుష్క సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన సూపర్ మూవీ రిలీజ్ డే ఈ రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం మూవీ వరకు అనుష్క ఎన్నో మెట్లు ఎక్కుతూ వస్తుంది. ఆమెను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అనుష్క మరింత గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు" పూరి తెలిపాడు.
 
కాగా దక్షిణాది నెం.1 హీరోయిన్‌గా రాణించిన అనుష్క శెట్టి 'భాగమతి' తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 'బాహుబలి' తో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన జేజమ్మ.. ప్రస్తుతం బరువు తగ్గి 'నిశ్శబ్దం' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు