టీవీ యాంకర్‌తో వివాహేతర సంబంధం.. టీవీ దర్శకుడిపై భార్య ఫిర్యాదు!

బుధవారం, 27 ఏప్రియల్ 2016 (09:05 IST)
యాంకర్‌తో సహజీవనం చేస్తూ తనను హింసిస్తున్నాడంటూ ఓ టీవీ సీరియల్ దర్శకుడి భార్య మంగళవారం మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రముఖ టీవీ సీరియల్ దర్శకుడు మధుకర్‌పై ఆయన భార్య ఆరోపణలు చేశారు. టీవీ యాంకర్ గీతా భగవత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, అంతేకాకుండా తమ ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
 
మోతీనగర్ ప్రాంతానికి చెందిన జి. సీత ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు టీవీ సీరియల్ డైరెక్టర్ మధుకర్‌తో 2002లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని చెప్పారు. తన భర్త విడాకులు ఇవ్వకుండానే టీవీ యాంకర్ గీతాభగత్‌ను రెండో వివాహం చేసుకున్నాడని పేర్కొన్నారు. 
 
అప్పటి నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయని ఆవేదన చెందారు. వివాహేతర సంబంధం వల్లే మధుకర్ తనను ఇంట్లో నుంచి వెల్లగొట్టారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. మధుకర్, గీతా భగవత్ తనను మానసికంగా వేధిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ విషయమై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న భర్త మధుకర్, గీతాభగత్, ఆమె తల్లిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది.

వెబ్దునియా పై చదవండి