Ed Sheeran: దేవర పాటను ఇంగ్లీష్ సింగర్ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (video)

సెల్వి

సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (11:51 IST)
Ed Sheeran
బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో షేప్ ఆఫ్ యూ పాటను పాడారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా లైవ్ ప్రదర్శన చేపట్టారంటూ ఓ పోలీసు ఎంటరై ఎడ్ షీరన్ పాడుతుండగానే మైక్ వైర్ తీసివేశాడు. ఈ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలలో తన ప్రదర్శనలు ఇచ్చాడు. చెన్నైలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్.రెహమాన్‌తో కలిసి ఎడ్ షీరన్ క్లాసిక్ ఊర్వశి సాంగ్‌ను పాడారు. ఇక తాజాగా చర్చ్ స్ట్రీట్‌లో పాడటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
తాము ముందస్తు అనుమతి తీసుకున్నామని దానిని అధికారులు తిరస్కరించారని ఎడ్ షీరన్ టీమ్ తెలిపింది. అయితే వారికి ఇంకా అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా బెంగళూరు పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు 'దేవర' పాటను ఇంగ్లీష్ సింగర్ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ పాడారు. ఒరిజినల్ వెర్షన్ ఆలపించిన గాయని శిల్పారావుతో కలిసి ఓ కన్సర్ట్‌లో 'చుట్టమల్లే' పాటను పాడారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

'దేవర' పాట పాడిన ఇంగ్లీష్ సింగర్.. వీడియో వైరల్..!

'చుట్టమల్లే..' పాట పాడిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్

ఒరిజినల్ వెర్షన్ ఆలపించిన గాయని శిల్పారావుతో కలిసి ఓ కన్సర్ట్‌లో 'చుట్టమల్లే' పాట పాడి ప్రేక్షకులను అలరించిన బ్రిటిష్ సింగర్ pic.twitter.com/3Sx90yP8qc

— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు