పాకిస్థాన్ మోడల్ ఖండీల్ బలోచ్ హత్యకు గురైన నేపథ్యంలో.. పాక్ శ్రుంగార తార నదియా అలీ(25) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఖండీల్ను పరువు కోసం ఆమె సోదరుడే చంపేసిన నేపథ్యంలో.. తనను చంపేస్తానని చెప్పినా సరే శ్రుంగార తారగా స్క్రీన్పై కనిపిస్తానని, ఆ వృత్తిని వదులుకునే ప్రసక్తే లేదని.. ప్రస్తుతం అమెరికాలోని లాస్ఏంజెలెస్లో స్థిరపడిన నదియా అలీ తేల్చేసింది. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లోనే శ్రుంగార తారగా నటించే తనకు మిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారని వివరించింది.
డాన్సర్గా కెరీర్ను ప్రారంభించిన నదియా ఆ తర్వాత శ్రుంగార తారగా మారిపోయింది. ఇప్పటికే లక్షలాదిమంది ఫ్యాన్స్ను సంపాదించుకున్న నదియాను పాకిస్థాన్ నిషేధించింది. తనను పాకిస్థాన్ అధికారికంగానే బ్యాన్ చేసిందని నదియా ఈ వృత్తిలో తనకు ఎంతో సంతోషం లభిస్తోందని పేర్కొంది. ఇక నదియా కుటుంబీకులు పాకిస్థాన్లో ఉన్నప్పటికీ నదియా అక్కడి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
తానో ముస్లింనని దీంతో తనకు కష్టాలు ఎక్కువని ఆమె పేర్కొంది. తాను ఎంచుకున్న వృత్తితో తల్లిదండ్రులు అంత సంతోషంగా లేకపోయినా తర్వాత వారు అర్థం చేసుకున్నారని నదియా పేర్కొంది. ఓ కూతురుగా తాను చేసే పనిని ఏ తల్లిదండ్రులు అంగీకరించరని, కానీ తప్పని పరిస్థితుల్లోనే ఈ వృత్తిలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరకు తన ప్రాణానికి ముప్పు వచ్చినా ఈ వృత్తిని వదులుకోనని నదియా వెల్లడించింది.