బంగారు పట్టుచీర.. పహారియాతో తిరుమలలో పెళ్లి.. జాన్వీ ఏమందంటే?

సెల్వి

గురువారం, 9 మే 2024 (11:58 IST)
బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం రెండు ప్రధాన తెలుగు చిత్రాలలో నటిస్తోంది. అయితే ఆమె కెరీర్ టేకాఫ్ అవుతున్న సమయంలో, జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లను ఎదుర్కొంది.
 
శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్‌ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. వారు చాలా సన్నిహితంగా ఉంటారు. జాన్వీ ఎక్కడికి వెళ్లినా అతను ఎల్లప్పుడూ ఆమెతో కనిపిస్తాడు. తిరుమల తిరుపతి దేవస్థానం సహా పలు ఆలయాల్లో కలిసి పూజలు నిర్వహించడం కూడా చూసేవుంటాం. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
 
తిరుపతి ఆలయంలో బంగారు చీరలో శిఖర్ పహారియాను వివాహం చేసుకోవాలని జాన్వీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏదైనా రాసేస్తారా అంటూ ప్రశ్నించింది. దీంతో జాన్వీ కపూర్ రూమర్లకు తెరపడింది. ప్రస్తుతం ఆమె "దేవర పార్ట్ 1" సెట్స్‌పై పని చేస్తోంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వం వహించే స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం కూడా ప్రారంభించనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు