నా అప్ కమింగ్ ప్రాజెక్టులో జాన్వీ ఉందనేది కేవలం రూమర్ మాత్రమే... హీరో నాని

ఠాగూర్

సోమవారం, 26 ఆగస్టు 2024 (08:45 IST)
నేచురల్ స్టార్ నాని సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించనుందనే వార్త హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నాని తాజాగా స్పందించారు. 'నా అప్ కమింగ్ ప్రాజెక్టులో జాన్వీ ఉందనేది కేవలం రూమర్ మాత్రమే. బహుశా ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతుంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగులతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోలేకపోతున్నాను' అని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు. ఇదిలావుంటే, నాని హీరోగా నటించిన "సరిపోదా శనివారం" చిత్రం ఈ నెల 29వ తేదీన తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
మరోవైపు, జాన్వీ కపూర్ కూడా తెలుగు చిత్రాల్లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. రెండు చిత్రాలతో తెలగు ప్రేక్షకులను పలుకరించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన "దేవర" చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా వచ్చే ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 27వ తేదీన విడుదలవుతుంది. అలాగే, "ఉప్పెన" ఫేమ్ సాన బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో కూడా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. నానితో చిత్రం ఖరారైతే జాన్వీ నటించే మూడో తెలుగు చిత్రం అవుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు