ఈ సందర్భంగా…. డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో సినిమా తెలుగు హక్కుల కోసం మంచి పోటీ ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాను. ''ఎంతవరకు ఈ ప్రేమ'' అనే పేరుతో సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నామని తెలిపారు. అన్నీకార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను తెలుగు, తమిళంలో అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డి. వెంకటేష్ వెల్లడించారు.