ఫ్యాన్స్‌కు జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్.. హద్దులు దాటే అభిమానులు నాకొద్దు!

ఆదివారం, 28 ఆగస్టు 2016 (13:42 IST)
సినీ అభిమానులకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. హద్దులు దాటే అభిమానులు తనకొద్దంటూ పిలుపునిచ్చారు. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‍‌లో జరిగిన ఘర్షణలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దాడిలో పవన్ కల్యాణ్ అభిమాని తిరుపకితి చెందిన వినోద్ రాయల్ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఇది పెను దుమారం రేపింది. చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ ఏకంగా తిరుపతికి వెళ్లి.. అభిమాని తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
 
దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని ఘాటుగా స్పందించాడు. సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని చెప్పిన జూనియర్... ఆ అభిమానం హద్దులు దాటకూడదని హితవు పలికాడు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని సూచించాడు. ముందు దేశం, తర్వాత కుటుంబం... ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని తేల్చి చెప్పాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్... భవిష్యత్తులో ఉండబోవని కుండబద్దలు కొట్టాడు. అందువల్ల అభిమానులు జాగ్రత్తగా మెలగాలని సూచించాడు. 

వెబ్దునియా పై చదవండి